ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మాణంలో దర్శకుడు సాయి రాజేశ్ రూపొందించిన కల్ట్ బ్లాక్ బస్టర్ బేబి మరో హిస్టారిక్ ఫీట్ చేసింది. తాజాగా జరిగిన ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డ్స్ లో బేబి సినిమాకు 5 అవార్డ్స్ దక్కాయి. 8 నామినేషన్స్ లో 5 అవార్డ్స్ గెల్చుకుంది బేబి. ఈ నేపథ్యంలో మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు మూవీ టీమ్. ఈ కార్యక్రమంలో
చదవండి: పది లక్షలు ఇస్తే ఏకంగా రూ. 44 లక్షలు – నయా మోసం
నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ – అవార్డ్స్ అంటే స్టార్స్ సినిమాలకే వస్తాయనే అపోహను తొలగినపోయిన సందర్భం ఇది. బేబి సినిమాకు 5 ఫిలింఫేర్ అవార్డ్స్ దక్కడం సంతోషంగా ఉంది. ఫిలిం బాగా ఫేర్ చేస్తే చాలు అనుకుంటాం కానీ ఫిలింఫేర్స్ కూడా దక్కడం మర్చిపోలేనిది. బేబి మాకు ఎన్నో మెమొరీస్ ఇస్తూనే ఉంది. రివార్డ్స్ తోపాటు అవార్డ్స్ అందిస్తోంది. గామా దగ్గర నుంచి దేశంలోని పలు అవార్డ్స్ మా సినిమాకు దక్కుతున్నాయి. ఒక మంచి సినిమా చేస్తే తప్పకుండా అన్నీ వస్తాయని చెప్పేందుకు బేబి ఎగ్జాంపుల్. క్రిటిక్స్, బాక్సాఫీస్ సక్సెస్ వేర్వేరుగా ఉంటాయి. కానీ మా మూవీకి ఆ రెండూ కలిశాయి. దర్శకుడు సాయి రాజేశ్ నాకు ఎప్పటినుంచో మంచి మిత్రుడు. ఆయనలో గొప్ప టాలెంట్ ఉంది. చిరంజీవి గారి కెరీర్ లో ఖైదీ ఎలాగో నా కెరీర్ లో బేబి అలా సక్సెస్ ఇచ్చింది. అన్నారు.