హీరో రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రాబోతోంది ‘మిస్టర్ బచ్చన్’. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, షో రీల్, టీజర్ మంచి రెస్పాన్స్ తో బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే డబ్బింగ్ ని కంప్లీట్ చేశారు. తన క్యారెక్టర్ కు సొంతంగా డబ్బింగ్ చెప్పారు. తెలుగు తన మాతృభాష కాకపోయినప్పటికీ కష్టపడి నేర్చుకొని తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పడం అందరినీ సర్ ప్రైజ్ చేసింది. ఆమె డెడికేషన్, ప్రొఫెషనలిజంను అందరూ ప్రశంసిస్తున్నారు.
చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై పేరెంట్స్ కమిటీ స్థానంలో..స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టిజి విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి అయాంక బోస్ సినిమాటోగ్రాఫర్. ప్రొడక్షన్ డిజైన్ బ్రహ్మ కడలి. ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్. మిస్టర్ బచ్చన్ ఆగస్ట్ 15న గ్రాండ్ విడుదల కానుంది.