మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ నుంచి కాస్టింగ్ కాల్ ప్రకటన వెలువడింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ రూపొందిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వీడీ 14 నుంచి ఈ రోజు కాస్టింగ్ కాల్ ప్రకటన చేశారు. ఔత్సాహిక నటీనటులను ఎంపిక చేసి వీడీ 14లో నటించే అవకాశం కల్పించనున్నారు.
తిరుపతి, అనంతపురం, కడప, కర్నూల్ లో జూలై 1వ తేదీ నుంచి జూలై 9వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆడిషన్స్ జరగనున్నాయి. ఈ సినిమా షూటింగ్ మొత్తం రాయలసీమలోనే జరగనుంది. నటనలో ప్రతిభ గల కొత్త టాలెంట్ కు ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఈ సినిమా తెరకెక్కుతోంది.