సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ బ్లాక్బస్టర్ సక్సెస్ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘తెలుసు కదా’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ మూవీతో డైరెక్టర్ గా డెబ్యు చేస్తున్నారు. నీరజ కోన, సిద్దు ఇమేజ్ దృష్టిలో ఉంచుకుని స్క్రిప్ట్ను రెడీ చేశారు. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమాలని నిర్మించే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్ట్ను చాలా గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ చిత్రం ఇప్పుడు రోలింగ్ కి రెడీ అయ్యింది.
చదవండి: నాని వర్సెస్ ఎస్ జే సూర్య
‘తెలుసు కదా’ రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 5 నుంచి ప్రారంభం కానుంది. ఈ కీలకమైన, లెన్తీ షెడ్యూల్లో టాకీ పార్ట్స్ తో పాటు సాంగ్స్ ని షూట్ చేస్తారు. హైదరాబాద్లో 30 రోజుల పాటు సాగే షెడ్యూల్ ఇది. మూవీ లీడ్ కాస్ట్ షూటింగ్లో పాల్గొంటారు. నిర్మాతలు ప్రీ-ప్రొడక్షన్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా కనిపించనున్న ఈ సినిమా కోసం సిద్దూ జొన్నలగడ్డ స్టైలిష్గా మేకోవర్ కానున్నారు. వైవా హర్ష కీలక పాత్రలో నటిస్తున్నారు.