కష్ట సమయంలో తెలుగు ప్రజలకు అండగా నిలబడుతున్నారు స్టార్ హీరోలు. ఎన్టీఆర్, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు కోటి రూపాయల చొప్పున వరదల బాధితుల సహాయర్థం విరాళం ప్రకటించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కోటి రూపాయల విరాళం అందిస్తున్నట్లు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు 50 లక్షల రూపాయల చొప్పున మన స్టార్స్ విరాళం అందిస్తున్నట్లు తెలిపారు. విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, త్రివిక్రమ్, నాగవంశీ, రాధాకృష్ణ, అనన్య నాగళ్ల…ఇలా తెలుగు నటీనటులు, స్టార్స్ తమ శక్తి మేరకు వరద బాధితుల కోసం ఆర్థిక సాయం అందిస్తున్నారు.
చదవండి: గోపీచంద్, శ్రీను వైట్ల విశ్వ ప్రయత్నం ఫలించేనా..?
వరద సాయంపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ (ఎక్స్) ద్వారా స్పందించారు. ఆయన ట్వీట్ చేస్తూ – ‘‘తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం వుంది. ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాల లో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు