జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ కార్యదర్శి శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేశారు. రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు, జనసేన పార్టీ శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు, శ్రీమతి లోకం మాధవి, శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, శ్రీ బొమ్మిడి నాయకర్, శ్రీ పత్సమట్ల ధర్మరాజు, శ్రీ గిడ్డి సత్యనారాయణ, శ్రీ వర ప్రసాద్ గార్లు తదితరులు వెంట రాగా రిటర్నింగ్ అధికారి ఎమ్.విజయరాజుకు నామినేషన్ పత్రాలు అందజేశారు.
అనంతరం శాసనసభ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ పి.హరిప్రసాద్ గారు మాట్లాడుతూ “పాత్రికేయుడిగా ప్రయాణం మొదలుపెట్టి ఇక్కడ వరకు రావడం చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన ఉంది. ఇప్పటి వరకు పాత్రికేయుడిగా ఆ సమస్యల పరిష్కారానికి పరోక్షం